మురమళ్ళలోని వీరేశ్వరస్వామి అన్నదాన ట్రస్టుకు శనివారం విజయవాడకు చెందిన పులి విజయనరసింహం రూ. 24, 666 విరాళాన్ని ఆలయ పర్యవేక్షణాధికారి బొల్లం వీరభద్రరావుకు అందించారు. దాతను స్వామి చిత్రపటం, ప్రసాదం అందించి సత్కరించారు. దాతకు ప్రత్యేక దర్శనం చేయించి స్వామి చిత్రపటం, ప్రసాదం అందజేసారు. విరాళాలకు ఆదాయపు పన్ను మినహాయింపు ఉంటుందని, దాతలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఈవో కోరారు.