ఐ. పోలవరం: ఆకస్మిక తనిఖీ

68చూసినవారు
ఐ. పోలవరం: ఆకస్మిక తనిఖీ
మలేరియా డెంగ్యూ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలని జిల్లా మలేరియా అధికారి ఎన్. వెంకటేశ్వరరావు సూచించారు. ఐ. పోలవరం మండలం జి. వేమవరం ప్రాథమిక ఆరోగ్య కేంద్రంను బుధవారం ఆయన ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్బంగా ప్రయోగశాలలో పలు రికార్డులను పరిశీలించారు. అనంతరం సిబ్బందికి పది సూచనలు ఇచ్చారు. కార్యక్రమంలో వైద్య సిబ్బంది పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్