కాట్రేనికోన మండలం తిమ్మాపురానికి చెందిన కొత్తపల్లి సుబ్బారావు (80), సీతమ్మ (75) దంపతులు తమ ఆరుగురు పిల్లలను కష్టపడుతూ పెంచారు. ఇటీవల అనారోగ్యంతో బాధపడుతున్న సీతమ్మ హైదరాబాద్ లో కుమారుడి ఇంట్లో చికిత్స పొందుతూ శనివారం మృతిచెందారు. ఆమె మృతదేహాన్ని గ్రామానికి తీసుకొస్తుండగా తీవ్ర మనస్తాపానికి గురైన సుబ్బారావు ఆదివారం ప్రాణాలు విడిచారు.