దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ గా మురమళ్ల వీరేశ్వరస్వామి దేవస్థానం ఈఓ ఎం. లక్ష్మీనారాయణను నియమిస్తూ దేవాదాయ, ధర్మాదాయ శాఖ కమిషనర్ కార్యాలయం నుంచి బుధవారం ఉత్తర్వులు వెలువడ్డాయి. దేవాదాయ శాఖ జిల్లా అసిస్టెంట్ కమిషనర్ గా పనిచేస్తున్న డి. నాగమల్లేశ్వరరావు ఉద్యోగ విరమణ చేయడంతో లక్ష్మీనారాయణకు పూర్తి అదనపు బాధ్యతలు అప్పగిస్తూ అడిషనల్ కమిషనర్ కె. రామచం ద్రమోహన్ ఉత్తర్వులు విడుదల చేశారు.