అగ్ని ప్రమాదాలపై అప్రమత్తంగా ఉండాలని అగ్నిమాపక ఇన్ఛార్జ్ అధికారి మురళి తెలియజేశారు. అగ్నిమాపక వారోత్సవాలలో భాగంగా ముమ్మిడివరం మండలం పరిధిలోని బల్ల గేటు సెంటర్, మార్కెట్ సెంటర్, బస్టాండ్ సెంటర్, కొండాలమ్మ చింత సెంటర్లలో ప్రజలకు మంగళవారం కరపత్రాలు పంపిణీ చేశారు. అగ్ని ప్రమాదాలు సంభవించినప్పుడు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలో స్థానిక ప్రజలకు అవగాహన కల్పించారు.