ముమ్మిడివరం మండలంలో పలు అభివృద్ది పనులకు ప్రారంభోత్సవ కార్యక్రమం శనివారం జరిగింది. స్థానిక ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ దాట్ల సుబ్బరాజు ముఖ్య అతిథిగా హాజరై మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం ద్వారా మంజూరైన సిమెంటు రోడ్లు, రెండు క్యాటిల్ షేడ్ లను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ గంగ భవాని, ఎంపీడీవో వెంకటాచార్య, పలువురు అధికారులు, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.