ముమ్మిడివరం మండలం చిన్న కొత్తలంక గ్రామంలో పత్సమట్ల సుబ్రహ్మణ్య రాజు, సీతామహాలక్ష్మి దంపతుల గృహంలో డీప్ ఫ్రిజ్లో అమర్నాథ్ శివలింగ రూపంలో బుధవారం మంచు శివలింగం ఏర్పడడింది. కార్తీక మాసం కావడంతో శివుడు ఉద్భవించాడని భావిస్తున్నారు. ఈ శివలింగాన్ని చూసి భక్తులు భక్తి పారవశ్యంతో దర్శనం చేసుకుంటున్నారు. మారేడు దళాలతో శివలింగాన్ని అలంకరించారు.