ఐ. పోలవరం విద్యుత్తు ఉపకేంద్రం పరిధిలో ఆదివారం మరమ్మతులు చేపట్టనున్నట్లు ఈఈ రవికుమార్ శనివారం తెలిపారు. ఈ నేపథ్యంలో టి. కొత్తపల్లి, ఐ. పోలవరం, గుత్తెనదీవి, జి. వేమవరం, జి. మూలపొలం, కేశనకుర్రు, తిళ్లకుప్ప, ఎదుర్లంక, గోగుల్లంక, పాతఇంజరం, మగసానితిప్ప గ్రామాలకు ఆదివారం ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు విద్యుత్ సరఫరా నిలుపుదల చేస్తున్నామని, వినియోగదారులు సహకరించాలని ఈఈ కోరారు.