ముమ్మిడివరం మం. సీహెచ్ గున్నేపల్లిలోని సత్తెమ్మతల్లి అమ్మవారి ఆలయం వద్ద ఆదివారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. గుమ్మళ్ల రాము అనే భక్తుడు సమకూర్చిన వివిధ రకాల కూరగాయలతో అమ్మవారిని శాకంబరిగా అలంకరించారు. ఆషాడమాసం ఆదివారం కావడంతో జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చి అమ్మవారిని దర్శించుకొని, కానుకలు సమర్శించారు. రోచర్ల నాగభూషణం, గొలకోటి మల్లిబాబు భక్తులకు పులిహోర పంపిణీ చేశారు.