సమగ్ర శిక్షాలో పని చేస్తోన్న తమకు రెండు నెలల వేతన బకాయిలు, సమ్మెకాల వేతనం చెల్లించాలని సమగ్ర శిక్షా కాంట్రాక్టు, అవుట్సోర్సింగ్ ఉద్యోగుల జేఏసీ చైర్మన్ సీహెచ్ వెంకన్నబాబు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. రెండు నెలలుగా వేతనాలు చెల్లించక పోవడంతో కుటుంబపోషణ కష్టతరంగా మారిందన్నారు. గత ప్రభుత్వం సమ్మెకాల వేతనం, మినిట్స్ అమలు చేయలేదని, కూటమి ప్రభుత్వం వేతనాలు చెల్లించి న్యాయం చేయాలని కోరారు.