సాధారణ బదిలీల్లో భాగంగా నిత్య కల్యాణం పచ్చతోరణంగా విరాజిల్లుతున్న ఐ. పోలవరం మండలం మురమళ్ల శ్రీవీరేశ్వర స్వామి దేవస్థానం సహాయ కమీషనర్గా సత్య నారాయణ శనివారం భాద్యతలు స్వీకరించారు. అర్చకులు, వేద పండితులు, పురోహితులు, సిబ్బంది ఆలయ మర్యాదలతో ఆయనకు ఘన స్వాగతం పలికారు. స్వామి వారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు జరిపారు. వేద ఆశీర్వచనం అందించారు.