తాళ్లరేవు మండలం సుంకరపాలెంలో విషాదం చోటుచేసుకుంది. స్థానిక అంబేడ్కర్ నగర్ కు చెందిన సత్యనారాయణ అనే వ్యక్తి ప్రధాన రహదారి వద్ద వ్యాన్ ఢీకొని మృతి చెందారు. సత్యనారాయణ(69) శుక్రవారం ఉదయం నీరు పట్టుకునేందుకు రహదారి పక్కనే ఉన్న కొళాయి వద్దకు వెళ్లి రోడ్డు పక్కన రాడ్డుపై కూర్చున్నారు. ఇంజరం నుంచి సుంకరపాలెం వెళ్తున్న వ్యాను సత్యనారాయణపైకి దూసుకెళ్లడంతో అక్కడికక్కడే మృతి చెందాడు.