అవినీతికి తావులేకుండా నగర పంచాయతీ అభివృద్ధే లక్ష్యంగా పనిచేయాలని ముమ్మిడివరం ఎమ్మెల్యే దాట్ల బుచ్చిబాబు సూచించారు. ముమ్మిడివరం నగర పంచాయతీ కార్యాలయ సమావేశ మందిరంలో ఛైర్మన్ కమిడి ప్రవీణ్ కుమార్ అధ్యక్షతన శనివారం జరిగిన కౌన్సిల్ సమావేశానికి ఎమ్మెల్యే ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. మున్సిపల్ మంత్రిగా నారాయణతో ఉన్న పరిచయాలతో నిధులు తీసుకువచ్చి నగర పంచాయతీ అభివృద్ధికి పార్టీలకు అతీతంగా పనిచేస్తానన్నారు.