ముమ్మిడివరం నగర పంచాయతీ పరిధిలోని కాశివారితూము ప్రాంతంలో వ్యాను బోల్తాపడిన ఘటన శనివారం చోటుచేసుకుంది కాకినాడ నుంచి అమలాపురంవైపు ఐస్ లోడుతో వెళ్తున్న వ్యాను కాళి వారితూము సెంటర్ లో బైక్ ను తప్పించబోయి అదుపుతప్పి బోల్తాపడింది. సమయంలో రహదారిలో ఎవరూ లేక పోవడంతో పెను ప్రమాదం తప్పింది. డ్రైవర్ స్వల్పగాయాలతో బయటపడ్డారు.