మంగళగిరి తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో శనివారం రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుని నిడదవోలు మాజీ ఎమ్మెల్యే బూరుగుపల్లి శేషారావు మర్యాదపూర్వకంగా కలిసారు. ఈ సందర్భంగా రైతులకు ధాన్యం బకాయిలు గురించి మాట్లాడారు. త్వరలోనే రైతులకు రావాల్సిన మొత్తాన్ని ప్రభుత్వం చెల్లిస్తుందని సీఎం చంద్రబాబు హామీ ఇచ్చారు.