కొవ్వూరు పట్టణంలో గురువారం పారిశుద్ధ్య పనులు వేగవంతం చేశారు. సర్ ఆర్ధర్ విగ్రహం, డంపింగ్ యార్డ్, రైల్వే స్టేషన్ వరకు రోడ్లకు ఇరుపక్కల వ్యర్ధాలను మున్సిపల్ సిబ్బంది తొలగిస్తునారు. రోడ్లకు ఇరుపక్కల నరికివేసిన చెట్ల కొమ్మలు, భవన నిర్మాణ వ్యర్ధాలు, చెత్త చెదారాలతో నిండి రహదారికి ఇబ్బందిగా ఉన్న వ్యర్థాలను మున్సిపల్ అధికారులు తొలగించడంతో ప్రయాణికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.