మారుమూల గ్రామీణ ప్రాంతాలతో పాటు దూర ప్రాంత ప్రజలకు అన్నివేళలా బస్సు సర్వీస్ సౌకర్యం కల్పించే విధంగా రోడ్డు రవాణా సంస్థ అధికారులు తగిన చర్యలు చేపట్టాలని మంత్రి కందుల దుర్గేష్ పేర్కొన్నారు. బుధవారం నిడదవోలు బస్టాండ్ ఆవరణలో నూతన బస్సు సర్వీస్లను మంత్రి ప్రారంభించి మాట్లాడారు. నిడదవోలు - విశాఖపట్నం వెళ్లే నూతన బస్ ను ప్రారంభించడం సంతోషంగా ఉందన్నారు.