అమరావతి మహిళలపై అనుచిత వ్యాఖ్యలు తగదని, ఇది యావత్ మహిళా జాతికే అవమానమని తెలుగు మహిళలు పేర్కొన్నారు. మహిళా జాతిని అవమానపరుస్తూ, తీవ్ర అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేసిన కొమ్మినేని శ్రీనివాసరావు, జర్నలిస్ట్ కృష్ణంరాజు పై చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని మంగళవారం నిడదవోలులో నిరసన చేపట్టారు. అనంతరం మహిళలు, నాయకులు నిడదవోలు (టౌన్) పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు.