నిడదవోలు సామాజిక ఆసుపత్రిలో గుండెపోటుకు గురైన రోగులకు ఉపయోగపడే రూ. 45, 000 విలువైన టెనెక్టెప్లేస్ ఇంజెక్షన్ అందుబాటులో ఉందని హాస్పిటల్ సూపరింటెండెంట్ డా. ఫయాజ్ అహ్మద్ అన్సారీ శుక్రవారం తెలిపారు. ఈ టెనెక్టెప్లేస్ ఇంజక్షన్ అన్ని సామాజిక ఆరోగ్య కేంద్రలు, ఏరియా హాస్పిటల్స్, జిల్లా ఆసుపత్రుల్లో అందుబాటులో ఉందని, ఈ ఇంజక్షన్ను పేషెంట్లు వినియోగించుకోవాలి అని కోరారు. ఈ మేరకు ఆసుపత్రిలో సదస్సు నిర్వహించారు.