నిడదవోలు నియోజకవర్గంలోని విజ్జేశ్వరంలో శనివారం జరిగిన సంక్రాంతి సంబరాలలో జిల్లా కలెక్టర్ ప్రశాంతి పాల్గొన్నారు. హరిదాసుకు కలెక్టర్, మంత్రి దుర్గేష్ బియ్యం పోశారు. ఈ సందర్భంగా భోగి మంటలు వెలిగించారు. అనంతరం ఏర్పాటు చేసిన రంగవల్లి పోటీలను కలెక్టర్, మంత్రి తిలకించారు. ఈ కార్యక్రమంలో పలువురు జిల్లా, మండల అధికారులు ఉన్నారు.