జనసేన ఆవిర్భావ సభను ప్రతిఒక్కరు విజయవంతం చేయాలని నిడదవోలు ఎమ్మెల్యే, మంత్రి కందుల దుర్గేష్ మంగళవారం పిలుపునిచ్చారు. ఆవిర్భావ సభ నిర్వహణకు పకడ్భందీగా ఏర్పాట్లు జరుగుతున్నాయన్నారు. భద్రత ఏర్పాట్లపై జిల్లా పోలీస్ అధికారులతో చర్చించామన్నారు. పెద్దఎత్తున సభకు తరలిరావాలని కోరారు. సభ నిర్వహణకు 14 కమిటీలను నియమించామన్నారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా చర్యలు తీసుకున్నామన్నారు.