నిడదవోలు రైల్వే జంక్షన్లో ఎక్స్ప్రైస్ రైళ్లకు హాల్ట్ ఇవ్వాలని కోరుతూ బీజేపీ ఆధ్వర్యంలో మంగళవారం నిడదవోలు రైల్వే స్టేషన్లోని రైల్వే అధికారులకు వినతిపత్రం అందజేశారు. నియోజకవర్గ ఇన్ఛార్జ్ బండి సత్యనారాయణ ఆధ్వర్యంలో జన్మభూమి, ఎల్ టి టి ఎక్స్ప్రైస్లకు హాల్ట్ ఇవ్వాలన్నారు. ప్రస్తుతం నిడదవోలు రైల్వే స్టేషన్ను అమృత పథకంలో భాగంగా రూ. 27 కోట్లతో అభివృద్ధి చేస్తున్నారన్నారు.