మహనీయుల ఆశయ సాధన పోరాట ఆధ్వర్యంలో నిడదవోలు డీఎస్ఓ హైస్కూల్లో సామాజిక విప్లవకారుడు కందుకూరి వీరేశలింగం జయంతిని బుధవారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కమిటీ కన్వీనర్ జువ్వల రాంబాబు పాల్గొని వీరేశలింగం చిత్రానికి నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ మహిళా హక్కుల కోసం పోరాడిన యోధుడు కందుకూరి వీరేశలింగం అని అన్నారు.