నిడదవోలు మండలంలో 1000 మెట్రిక్ టన్నులు, పెరవలి మండలంలో 1000 మెట్రిక్ టన్నులు, ఉండ్రాజవరం మండలంలో 6025 మెట్రిక్ టన్నుల అదనపు ధాన్యం కొనుగోలుకు మంత్రి కందుల దుర్గేష్ బుధవారం ఆదేశించారు. నియోజకవర్గంలో మరో 8025 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేయనున్నట్లు వెల్లడించారు. విత్తనం నుంచి విక్రయం వరకు అన్నదాతకు అండగా ఉంటామని ఇచ్చారు.