నిడదవోలు పట్టణంలో ఇటీవలే మరణించిన భాష కుటుంబ సభ్యులను శనివారం మంత్రి కందుల దుర్గేష్ నివాసానికి వెళ్లారు. గుర్తుతెలియని వ్యక్తులచే హత్యకు గురైన వంట మాస్టారు వల్లి భాష కుటుంబ సభ్యులను కలిసి మంత్రి కందుల దుర్గేష్ పరామర్శించి, ధైర్యం చెప్పారు. ఈ అఘాయిత్యానికి పాల్పడిన వ్యక్తులపై చట్టపరమైన చర్యలు తీసుకుని కఠినంగా శిక్షిస్తామని కుటుంబ సభ్యులకు హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు పాల్గొన్నారు.