పేకాట శిబిరంపై దాడి - రూ. 2.44 లక్షలు స్వాధీనం

70చూసినవారు
పేకాట శిబిరంపై దాడి - రూ. 2.44 లక్షలు స్వాధీనం
పెద్దాపురం పట్టణంలో రామారావు పేటలోని ఓ ఇంట్లో జూదం ఆడుతున్నట్లు సమాచారం అందడంతో సోమవారం అర్ధరాత్రి దాడి చేసి 9 మందిని అదుపులోకి తీసుకున్నట్లు పెద్దాపురం సీఐ క్రాంతికుమార్ తెలిపారు. వారి నుంచి రూ.2.44 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నామన్నారు. పట్టణంలో ఎక్కడైనా జూదం ఆడుతున్నట్లు తెలిస్తే తమకు సమాచారం అందించాలని కోరారు. సమాచారం తెలిపిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతామని పేర్కొన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్