పెద్దాపురం ఎక్సైజ్ సిబ్బంది దాడులు నిర్వహించారు. శుక్రవారం సారాయి తయారీకి నిల్వ ఉంచిన 800 లీటర్ల బెల్లపు ఊటను ధ్వంసం చేసి, కేసు నమోదు చేయడం జరిగిందని పెద్దాపురం ఎక్సైజ్ సీఐ అర్జునరావు తెలిపారు. పెద్దాపురం ఎక్సైజ్ పరిధిలోని జగ్గంపేట మండలం నరేంద్రపట్నం గ్రామంలో బెల్లపు ఊటను ధ్వంసం చేసినట్లు తెలిపారు. ఈ దాడులలో పెద్దాపురం ఎక్సైజ్ ఎస్ఐలు చిట్టిబాబు, ప్రసాదరావు, సిబ్బంది పాల్గొన్నట్లు తెలిపారు.