ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డితో పెద్దాపురం నియోజకవర్గ ఇన్ ఛార్జ్ దవులూరి దొరబాబు మంగళవారం తాడేపల్లిలో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా నియోజకవర్గంలోని తాజా రాజకీయ పరిణామాలపై చర్చించారు. అలాగే నియోజకవర్గంలో పార్టీని మరింత బలోపేతం చేసే అంశంపై కూడా ప్రధానంగా చర్చించినట్లు మీడియాకు తెలియజేశారు.