పెద్దాపురం: 3 వ రోజుకు చేరిన ఇంజనీరింగ్‌ కార్మికుల సమ్మె

53చూసినవారు
పెద్దాపురం: 3 వ రోజుకు చేరిన ఇంజనీరింగ్‌ కార్మికుల సమ్మె
తమ సమస్యలు పరిష్కారం కోరుతూ మున్సిపల్‌ ఇంజనీరింగ్ వర్కర్స్‌ చేపట్టిన నిరవధిక సమ్మె శుక్రవారం మూడవ రోజుకు చేరుకుంది. ఈ సందర్భంగా మున్సిపల్‌ కార్యాలయం వద్ద నిర్వహిస్తున్న సమ్మె శిబిరంలో ఇంజనీరింగ్‌ కార్మికులు నిరసన తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అనేక సంవత్సరాలుగా తాము విధులు నిర్వహిస్తున్నా తమకు వేతనాలు పెంచడం లేదన్నారు. తమకు ఉద్యోగ భద్రత కల్పించాలని, తమ సమస్యలను వెంటనే పరిష్కరించాలన్నారు.

సంబంధిత పోస్ట్