తమ సమస్యలు పరిష్కారం కోరుతూ … మున్సిపల్ ఇంజనీరింగ్ కార్మికులు చేపట్టిన నిరవధిక సమ్మె శనివారం నాలుగవ రోజుకు చేరుకుంది. ఈ సందర్భంగా మున్సిపల్ కార్యాలయం వద్ద నిర్వహిస్తున్న సమ్మె శిబిరంలో ఇంజనీరింగ్ కార్మికులు నిరసన తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ … తమ సమస్యలను పరిష్కరించి తమకు న్యాయం చేయాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో సంఘ నాయకులు సుంకర నాగేశ్వరరావు, కెవి రమణ, బి భద్రరావు ఉన్నారు.