రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధర కల్పించాలని, దళారుల దోపిడీని అరికట్టాలని ఏపీఆర్ఎస్ఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి బి. రమేష్ డిమాండ్ చేశారు. ఆంధ్రప్రదేశ్ రైతు కూలీ సంఘం ఆధ్వర్యంలో పెద్దాపురం మండలం పులిమేరు గ్రామం, ఆర్బికే సెంటర్ ఎదురుగా సామర్లకోట-పత్తిపాడు రోడ్డుపై గురువారం రైతులు రాస్తారోకో నిర్వహించారు. ఆర్బీకే సెంటర్లో తక్షణమే సీఎంఆర్ను ఓపెన్ చేయాలని డిమాండ్ చేశారు.