పెద్దాపురం మండలంలో 18 గ్రామాల ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు మండల వ్యవసాయాధికారి కె. సంజయ్ కుమార్ అన్నారు. గురువారం ఆయన పెద్దాపురం మండల పరిధిలోని కాండ్రకోట గ్రామంలో ధాన్యం కొనుగోలు కేంద్రం వద్ద ధాన్యాన్ని పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ. గతేడాది మండల పరిధిలో ధాన్యం కొనుగోలు కేంద్రాల ద్వారా 3 వేల క్వింటాళ్లు ధాన్యం కొనుగోలు చేశామన్నారు. ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు చేపట్టామన్నారు.