సామర్లకోట మండలం అచ్చంపేట ఏడీబీ రోడ్డు కొప్పవరం కూడలిలోని రాజ్యసభ సభ్యుడు సానా సతీష్ బాబు క్యాంపు కార్యాలయంలో శుక్రవారం ప్రజాదర్బార్ నిర్వహించనున్నట్లు ఎంపీ కార్యాలయ ప్రతినిధి ఒక ప్రకటనలో తెలిపారు. ప్రజా సమస్యల పరిష్కారం కోసం ఉదయం 10 గంటల నుంచి ప్రారంభమయ్యే ప్రజాదర్బార్ను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.