పిఠాపురం: విస్తృతంగా వాహన తనిఖీలు

68చూసినవారు
పిఠాపురం: విస్తృతంగా వాహన తనిఖీలు
పాకిస్థాన్ యుద్ధం నేపథ్యంలో పిఠాపురంలో విస్తృత తనిఖీలు నిర్వహిస్తున్నామని సీఐ శ్రీనివాస్ తెలిపారు. శుక్రవారం పిఠాపురంలో ఉప్పాడ సెంటర్లో వాహనాల తనిఖీలు, లాడ్జిలు, రైల్వేస్టేషన్, బస్టాండు, ఇతర రద్దీ ప్రాంతాలను పరిశీలించారు. అనుమానాస్పద వ్యక్తులు ఎవరైనా వస్తున్నారేమోనని నిఘా పెట్టినట్లు చెప్పారు. సీసీ కెమెరాలు నిత్యం పనిచేసేలా చూడాలని సూచించారు. పట్టణ ఎస్ఐ మణికుమార్, సిబ్బంది ఈ తనిఖీల్లో పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్