భారత సైన్యానికి రక్షణగా పవన్ కల్యాణ్ ప్రత్యేక పూజలు

76చూసినవారు
భారత సైన్యానికి రక్షణగా పవన్ కల్యాణ్ ప్రత్యేక పూజలు
పాకిస్థాన్ మీద భారత బలగాలు చేస్తున్న ఆపరేషన్ సిందూర్ ధర్మ యుద్ధానికి ప్రతి ఒక్కరి నైతిక మద్దతు అవసరమని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ తెలిపారు. శత్రు మూకలపై పోరాడుతున్న సైన్యానికి, దేశానికి నాయకత్వం వహిస్తున్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి దైవ బలం, ఆశీస్సులు ఉండేలా భగవంతుడిని ప్రార్థించాలని అన్నారు. శత్రు సేనలను కట్టడి చేసి, దేశాన్ని కాపాడే గొప్ప శక్తిసామర్థ్యాలు, సాంకేతిక పరిజ్ఞానం మన త్రివిధ దళాలకు మెండుగా ఉన్నాయని చెప్పారు. వారి కోసం దేశమంతా ప్రార్థించే సమయమిదని పవన్ కల్యాణ్ అన్నారు. శుక్రవారం ఈ మేరకు పవన్ కల్యాణ్ ఓ ప్రకటన విడుదల చేశారు.

సంబంధిత పోస్ట్