ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పిఠాపురం నియోజకవర్గం పర్యటనలో భాగంగా పిఠాపురం మండలం కుమారపురం గ్రామం కృష్ణుడుగుడి వద్ద ఎన్ఆర్ఈజీఎస్ నిధులతో నిర్మించిన మినీ గోకులంను శుక్రవారం ప్రారంభించారు. రాష్ట్ర వ్యాప్తంగా నిర్మించిన 12, 500 మినీ గోకులాలను పిఠాపురం కుమారపురం నుంచి లాంఛనంగా ప్రారంభించినట్లు ఆయన మీడియాకు తెలియజేశారు. గోవులను సంరక్షించాల్సిన బాధ్యత అందరి పైన ఉందన్నారు.