పిఠాపురం నియోజకవర్గంలో శుక్రవారం డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటనలో జనసేన పార్టీ మహిళా నేత చల్లా లక్ష్మికి గాయమైంది. సంక్రాంతి సంబరాలకు వెళ్లేందుకు ఆమె అనుమతి లేదని పోలీసులు అడ్డుకున్నారు. దీంతో అక్కడ తోపులాట చోటు చేసుకుంది. ఈ క్రమంలో చల్లా లక్ష్మీ తలకు గాయమైంది. పోలీసుల వైఖరిపై జనసేన వీర మహిళలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.