పిఠాపురం పరిధిలోని గోకివాడ, విరవాడ ప్రజలకు వచ్చిన ఓ ఫోన్ కాల్ భయాందోళనకు గురిచేస్తోంది. అమరావతి నుంచి అధికారులు ఫోన్ చేస్తున్నానంటూ 9953168455 నుంచి ఫోన్ వచ్చినట్లు స్థానికులు తెలిపారు. పథకాలు ఎలా అందుతున్నాయని మాటల్లో పెట్టి రూ. 60 వేలు కాజేశారని బాధితులు వాపోయారు. దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేశామన్నారు. ఇటువంటి ఫోన్లు వస్తే తమకు సమాచారం ఇవ్వాలని పోలీసుల సూచించారు.