కాకినాడ జిల్లా ఎస్పీ బిందు మాధవ్ ఆదేశాల మేరకు పిఠాపురం పట్టణంలో మంగళవారం సాయంత్రం పోలీసులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. రైల్వేస్టేషన్, బస్టాండ్ తదితర రద్దీ ప్రాంతాల్లో డాగ్ స్క్వాడ్ సహాయంతో తనిఖీలు చేపట్టారు. గంజాయి మత్తుపదార్థాలు, మాదకద్రవ్యాల వంటి అక్రమ రవాణాను అడ్డుకోవడం, రైల్వేస్టేషన్ పరిసరాలలో అనుమానాస్పద వ్యక్తులపై నిఘాపెట్టి, ప్రయాణికుల భద్రతను పెంచేందుకు చర్యలు తీసుకున్నట్లు తెలియజేశారు.