అక్రమ కబేళాల నిర్వహణపై నిరంతర నిఘా ఉంటుందని కాకినాడ ఆర్డీవో కిషోర్ హెచ్చరించారు. పిఠాపురం మున్సిపల్ కార్యాలయంలో మంగళవారం కబేళా నిర్వాహకులు, రెవెన్యూ, పంచాయతీ, పశు సంవర్ధక శాఖ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అక్రమ పశురవాణా, మాంసం విక్రయాలు, కబేళా నిర్వహిస్తున్న ఫిర్యాదులు ఎక్కువగా అందుతున్నాయన్నారు. ప్రజారోగ్యంపై ప్రత్యేక దృష్టి పెడుతూ చర్యలు చేపడుతున్నామన్నారు.