పొత్తులో భాగంగా పిఠాపురం నుంచి పవన్ కల్యాణ్ బరిలో దిగుతున్నారని చంద్రబాబు చెప్పినప్పుడు తాను ఏ పదవులు ఆశించకుండా, రైతుల కోసం పురుషోత్తపట్నం ఎత్తిపోతల పథకం ప్రారంభించాలని కోరానని మాజీ ఎమ్మెల్యే వర్మ తెలిపారు. మంగళవారం పిఠాపురం తెదేపా నేతలతో కలిసి ఎత్తిపోతల నుంచి పిఠాపురం ఆయకట్టుకు నీరు మళ్లింపు ప్రాంతాన్ని పరిశీలించారు. నాడు చంద్రబాబు మాట ఇచ్చిన ప్రకారం సార్వా సాగుకు నీటిని విడుదల చేశారన్నారు.