ఏలేరు ఆధునికీకరణ పనులకు వైకాపా అడ్డుకట్ట వేసిందని త్వరలోనే మొదటి, రెండో దశ పనులు పూర్తి చేసేందుకు ఉప ముఖ్య మంత్రి పవన్ కల్యాణ్ కృషి చేస్తున్నారని మాజీ ఎమ్మెల్యే వర్మ అన్నారు. పిఠాపురం మండలంలోని మంగితుర్తిలో బుధవారం వర్మ పర్యటించి, రైతుల సమస్యలు తెలుసుకున్నారు. గ్రామంలో స్లూయిస్ వద్ద పూర్వం వాలంక ఉండేదని, ఏలేరు ఆధునికీకరణ పనుల్లో భాగంగా కాస్త వెనక్కి జరపడంతో పలు కాలువలకు నీరు వెళ్లడం లేదన్నారు.