శంఖవరం మండలం కత్తిపూడిలో బుధవారం ఆనంద్ కుమార్ అనే అధికారి ఆధ్వర్యంలో ఫ్లయింగ్ స్క్వాడ్ బృందం తనిఖీలు నిర్వహించింది. స్టేట్ బ్యాంక్ సమీపంలో ఒక వ్యక్తి వద్ద నుంచి రూ. 3. 77 లక్షలు నగదును గుర్తించి సీజ్ చేశారు. ఆ నగదుకు సంబంధించి ఎటువంటి ఆధారాలు చూపకపోవడంతో కాకినాడ ట్రెజరీకి జమ చేసినట్లు అధికారులు తెలిపారు.