ఏలేశ్వరం నుంచి వయా బూరుగుపూడి, తామరాడ మీదుగా కాకినాడ వెళ్ళుటకు ఏలేశ్వరం నుండి ఆర్టీసీ బస్సు సర్వీసులు గురువారం ఏలేశ్వరం డిపో మేనేజర్ సత్యనారాయణ ప్రారంభించారు. ఈ మేరకు డిపో మేనేజర్ సత్యనారాయణ మాట్లాడుతూ ఉమ్మడి ఎమ్మెల్యేల ఆదేశానుసారం, ప్రజల సౌకర్యార్థం ఆర్టిసి బస్సు నూతన సర్వీసులను ప్రారంభించడం జరిగిందని ఆయన అన్నారు. కావున ప్రజలు ఈ సౌకర్యాన్ని సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు.