ప్రత్తిపాడు మండలం వెంకటనగరంలో లారీ ఢీకొని వ్యక్తి మృతి చెందిన ఘటన బుధవారం చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. చింతలూరు గ్రామానికి చెందిన నందారపు వీరబాబు, నందారపు కృష్ణ బైక్పై వెళుతుండగా వెనుక నుండి లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో వీరబాబు అక్కడికక్కడే మృతి చెందగా.. వెనుక కుర్చున్న వ్యక్తి పరిస్థితి విషమంగా ఉంది. మెరుగైన వైద్యం కోసం కాకినాడ జీజీహెచ్ కు తరలించారు.