దళితుల అభివృద్ధి కూటమి తోనే సాధ్యమని ఆ పార్టీ ఎస్సీ సెల్ నాయకులు పేర్కొన్నారు. గురువారం ప్రత్తిపాడు టీడీపీ కార్యాలయంలో పార్టీ ఎస్సీ సెల్ ఆర్గనైజింగ్ సెక్రెటరీ ఎన్. ఈశ్వరుడు ఇతర నాయకులతో కలిసి మీడియా సమావేశం నిర్వహించారు. ఎస్సీ వర్గీకరణ ముసాయిదా ఆర్డినెన్సు ఆమోదం తెలిపినందుకు సీఎం, డిప్యూటీ సీఎం, ఎమ్మెల్యే సత్యప్రభకు వారు కృతజ్ఞతలు తెలిపారు.