శంఖవరం మండలంలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన అన్నవరం సత్యదేవుని హుండీ ఆదాయం రూ. 1. 65 కోట్లు సమకూరింది. గత 29 రోజుల ఆదాయాన్ని శుక్రవారం లెక్కించారు. ఛైర్మన్ రోహిత్, ఈవో రామచంద్రమోహన్ సమక్షంలో తెరచి సొమ్ము లెక్కించారు. హుండీల ద్వారా రోజుకు సరాసరి రూ. 5, 69, 172 వచ్చిందన్నారు. అలాగే 51 గ్రాముల బంగారం, 633 గ్రాముల వెండి, విదేశీ డాలర్లు సమకూరినట్లు వివరించారు.