శంఖవరం గ్రామంలో బీసీ కార్పొరేషన్ ఆధ్వర్యంలో మహిళలకు ఉచిత కుట్టు మిషన్ శిక్షణా తరగతులను ప్రత్తిపాడు ఎమ్మెల్యే వరుపుల సత్యప్రభ శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, మహిళా సాధికారత సాధనలో భాగంగా వారికి ఈ కుట్టు మిషన్ శిక్షణా తరగతులను కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. మహిళల ఆర్థికంగా ఎదగాలనే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం కృషి చేస్తుందని తెలిపారు.