బిక్కవోలు మండలం కాపవరం గ్రామంలో శుక్రవారం అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి పర్యటించారు. అనంతరం కాపవరం గ్రామంలో పల్లెకి పోదాం కార్యక్రమాన్ని ప్రారంభించి సచివాలయం, గ్రామీణ ఆరోగ్య కేంద్రం, అంగన్వాడి కేంద్రాలను సందర్శించారు. గ్రామస్తులతో భేటీ అయ్యి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. కూటమి ప్రభుత్వం గ్రామాల్లో అభివృద్ధి లక్ష్యంగా పనిచేస్తుందని అన్నారు.