రాజమండ్రి: చిన్నారి ఆరోగ్యం కార్యక్రమం ప్రారంభం

80చూసినవారు
రాజమండ్రిలోని వెంకటేశ్వర ఆనం కళా కేంద్రం వద్ద 'చిన్నారి ఆరోగ్యం' కార్యక్రమాన్ని శనివారం ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా మంత్రి కందుల దుర్గేష్ పాల్గొని మాట్లాడారు. చిన్నారుల ఆరోగ్యంపై కూటమి ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ పెట్టిందన్నారు. తద్వారా 'చిన్నారి ఆరోగ్యం' కార్యక్రమాన్ని ప్రారంభించినట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ప్రశాంతి, జేసీ తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్